ప్రజల దృష్టి మళ్లించేందుకే సెక్షన్ 8

28 Jun, 2015 02:07 IST|Sakshi
ప్రజల దృష్టి మళ్లించేందుకే సెక్షన్ 8

ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి

 పులివెందుల : ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకే సెక్షన్ 8 వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం పులివెందులలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మా ట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీకల్లోతు అవినీతి కూపంలో కూరుకుపోయారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తర్వాత చంద్రబాబుకు సెక్షన్ 8  గుర్తుకు రావడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిం చారు. తెలంగాణాలో అభాసుపాలైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లోనూ అదే విధంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు.

ఓటుకు కోట్లు కేసులో సహకరించడం లేదని ఏకంగా గవర్నర్‌నే మార్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు అనే క సమస్యలతో బాధపడుతుంటే ఇవేవీ చంద్రబాబు పట్టిం చుకోకుండా కేసు నుంచి బయటపడేందుకు అనైతికంగా ఆలోచిస్తుంటే ఏపీ పోలీసులు దన్నుగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో చంద్రబాబు రాష్ట్రాన్ని మ ద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

 ప్రజలతో మమేకం :
 శనివారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. తన వద్ద కు వచ్చిన వారి సమస్యలు ఓపికగా విన్న ఎంపీ పరిష్కారానికి అధికారులకు ఫోన్లు చేసి బిజీబిజీగా గడిపారు.

మరిన్ని వార్తలు