⇒ సినీ నటుడు మంచు మోహన్బాబు
కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గొప్ప పోరాట యోధుడని, ఆయన చేపట్టిన ఉద్యమం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ సినీ హీరో మంచు మోహన్బాబు అన్నారు. భార్యతో కలిసి ఆదివారం కిర్లంపూడి వచ్చిన ఆయన ముద్రగడను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముద్రగడ అంటే తనకు మొదటి నుంచీ చాలా ఇష్టమని, ఆయనను కలిసేందుకు స్వయంగా తానే ఫోన్ చేసి వచ్చానని చెప్పారు.
లక్షలాది మంది కాపుల కోసం నిస్వార్థంగా పోరాడుతున్న ముద్రగడ విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. లక్ష్మీప్రసన్న కూడా రావాల్సి ఉందని, స్వల్ప అనారోగ్యం కారణంగా రాలేకపోరుుందన్నారు. ముద్రగడ తన కుటుంబ సభ్యులను, కాపు జేఏసీ నాయకులను మోహన్బాబుకు పరిచయం చేశారు. అనంతరం ముద్రగడ ఇచ్చిన విందులో మోహన్బాబు దంపతులు పాల్గొన్నారు.