పాదయాత్రకు అడ్డుతొలగే వరకు చలో కిర్లంపూడి: ముద్రగడ

27 Aug, 2017 01:47 IST|Sakshi
పాదయాత్రకు అడ్డుతొలగే వరకు చలో కిర్లంపూడి: ముద్రగడ
జగ్గంపేట: పాదయాత్రకు అడ్డుతొలగే వరకు ‘చలో కిర్లంపూడి’ నిర్వహించాలని కాపు నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసం వద్ద శనివారం కూడా ఆయన ఆందోళన నిర్వహించారు.

అనంతరం తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వారినుద్దేశించి ముద్రగడ ప్రసంగించారు. ఎన్నికల హామీని అమలు చేయాలని కోరుతుంటే.. సీఎం చంద్రబాబు కాపులను అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
మరిన్ని వార్తలు