బీసీ-ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోండి

23 Mar, 2018 16:52 IST|Sakshi
కాపు రిజర్వేషన్‌ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారందరూ బీసీ-ఎఫ్‌ సర్టిఫికేట్లకు దరఖాస్తు చేసుకోవాలని ముద్రగడ పద్మనాభం బుధవారం కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో, బయట సభల్లో కాపులను బీసీ-ఎఫ్‌ కేటగిరీ కింద చేర్చినట్లు చెబుతున్నారని అన్నారు. ఈ మేరకు కాపులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారు తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లి బీసీ-ఎఫ్‌ కుల ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

మరిన్ని వార్తలు