మున్సిపల్ ఛైర్మన్ పేట రాధారెడ్డి తన భార్య పట్ల అనైతికంగా ప్రవర్తించారని శ్రీకాళహస్తిలోని శరవణభవన్ హోటల్ యజమాని మనోహరన్ ఆరోపించారు. తమ హోటల్ను ఆయన లాక్కోవాలని చూస్తున్నట్లు మనోహరన్ దంపతులు తెలిపారు.
తమకు వాస్తవానికి 30 ఏళ్ల లీజు ఒప్పందం ఉన్నా, ఇప్పటికిప్పుడే ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారని, తమ అనుచరులతో రాధారెడ్డి పదే పదే దాడులు చేయిస్తున్నారని మనోహరన్ వాపోయారు. మహిళ అని కూడా చూడకుండా తన భార్యపట్ల రాధారెడ్డి అనైతికంగా ప్రవర్తించాడని ఆయన ఆరోపించారు.