ఆగిన కౌంటింగ్

2 Apr, 2014 03:00 IST|Sakshi

సాక్షి,చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్ సహా జిల్లాలో మరో ఆరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆగిపోరుుంది. బుధవారం కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా, హైకోర్టు వెలువరించిన తీర్పుతో ఈ పరిస్థితి ఏర్పడింది.రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఏప్రిల్ 9న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 10వ తేదీ లోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలకు లోబడి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది.
 
దీనితో రాజకీయ పార్టీల నేతలు ఊహించినట్లుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు లాగా, మే 16 తరువాత మున్సిపల్ ఫలితాలు వెల్లడించాలని తీర్పు రాలేదు. ప్రధాన రాజకీయపార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే మున్సిపల్ ఫలితాలు వెల్లడించడం మేలేనన్నట్లుగా ఉన్నాయి.  జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, పుంగనూరు, పలమనేరు, శ్రీకాళహస్తి, నగరి, మదనపల్లి మున్సిపాల్టీలకు 9వ తేదీన కౌటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
 
రెండు రోజుల తరువాత రిటర్నింగ్ స్వతంత్య్ర అభ్యర్థులు బరిలోనే ఉంటారు బి.కొత్తకోట, న్యూస్‌లైన్: తంబళ్లపల్లె నియోజకవర్గంలో జెడ్పీటీసీ బరిలో ఉన్న తన మద్దతుదారులు పోటీ నుంచి తప్పుకోరని తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి హైదరాబాదులో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన మంగళవారం రాత్రి జీ.శంకర్‌యాదవ్‌తో కలిసి బి.కొత్తకోటకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు మారిన వ్యక్తని, అందుకే టీడీపీలో చేరానని చెప్పారు.
 
పార్టీలో చేరే విషయంలో చివరి వరకు అనుమానంగానే ఉండేదని, చివరకు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరానని చెప్పారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జెడ్పీటీసీ బరిలో ఉన్న స్వతంత్య్ర అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకొని టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తారా అన్న ప్రశ్నకు కలిచర్ల సమాధానమిస్తూ తన మద్దతుదారులు పోటీ నుంచి విరమించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆరుగురిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా గెలుస్తారని చెప్పారు.
 
మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన పాదరక్షల పార్టీ ఎక్కడా కనిపించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ నాయకుడు జీ.శంకర్ మాట్లాడుతూ ప్రభాకర్‌రెడ్డి బాటలో  ముందుకుపోతామని చెప్పారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచే తమ కుటుంబం ఆయనతోనే ఉందన్నారు. ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీ పదవులను కైవశం చేసుకుంటామని జోస్యం చెప్పారు.
 
 నాడు ప్రత్యర్థులు
2009 అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్‌యాదవ్, ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్, పీఆర్‌పీ అభ్యర్థులుగా పోటీపడ్డారు. ప్రభాకర్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడం, శంకర్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడంతో ఇద్దరూ ప్రత్యర్థులుగా మారారు. అప్పటి నుంచి కలిచర్ల శంకర్‌ను ఉద్దేశించి బెంగళూరు బీసీ వద్దు.. స్థానిక బీసీకి టికెట్ ఇచ్చుంటే మద్దతు ఇచ్చేవాడిని అంటూ పత్రికా, బహిరంగ సమావేశాల్లో బాహాటంగానే విమర్శలు చేశారు. ఈ పరిస్థితుల్లో శంకర్, కలిచర్ల ఇద్దరూ టీడీపీ గూటికే చేరి ఒక్కటి కావడం గమనార్హం.అధికారి గెలుపు అభ్యర్థులతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన 813 మంది అభ్యర్థుల భవితవ్యం ఏప్రిల్ 9వ తేదీన తేలనున్నది.
 
 చివరి నిమిషంలో కౌంటింగ్ వాయిదా
ఆరు మున్సిపాల్టీలు, చిత్తూరు కార్పొరేషన్‌లో  ఓట్లు లెక్కింపునకు సంబంధించి  లెక్కింపు కేంద్రాల్లో ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు ప్రారంభించి ఆయా మున్సిపల్ కమిషనర్లు సిద్ధంగా ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో టీ.వీ చానల్స్‌లో హైకోర్టు ఏప్రిల్ 9వ తేదీకి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలను వాయిదా వేసినట్లు ప్రకటనలు రావడంతో రాష్ట్ర మున్సిపల్‌పరిపాలనా అధికారులను అడిగి నిర్థారించుకుని కౌంటింగ్ వాయిదావేశారు.అంతకు ముందే ఏప్రిల్ 2వ తేదీనే ఫలితాలు వెల్లడించమన్నా వెల్లడించే విధంగా డ్యూటీ సిబ్బందికి, మీడియాకు పాస్‌లు సిద్ధం చేశారు. అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు పాస్‌లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
 
 ఫలితాల కోసం మరోవారం :
మార్చి 30న నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం మరో వారం రోజులపాటు ఎదురుచూడాలి. వార్డుల్లో వివిధపార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వందలాది మంది అభ్యర్థులు తమ భవిష్యత్ తెలుసుకునేందుకు మరొక వారం రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.వెఎస్సాఆర్‌సీపీ, తెలుగుదేశం అభ్యర్థులతో పాటు, ఆయా మున్సిపాల్టీల్లో నాయకత్వం వహించి ప్రచార సారథ్యం వహించిన ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు కూడా తమ ఎన్నికల లెక్కలు సరైనవో కాదో తెలుసుకునేందుకు మరికొంత సమయం పట్టనున్నది.
 
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ప్రభావం?
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుందా అన్న మీమాంసలోనూ రాజకీయపార్టీలు ఉన్నాయి. అయితే జిల్లాలో అత్యధిక మున్సిపాల్టీలు కైవసం చేసుకునే దిశగా వైఎస్సాఆర్‌సీపీ ఉందని పోలింగ్‌సరళి అధారంగా తెలుస్తున్నది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల  కౌంటింగ్‌కు ముందు ఏప్రిల్ 6న మదనపల్లె డివిజన్‌లో, ఏప్రిల్ 11న తిరుపతి, చిత్తూరు డివిజన్లలో నిర్వహించనున్నారు. ఫలితాల ప్రభా వం స్థానిక ఎన్నికలపై ఎలా ఉంటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.

మరిన్ని వార్తలు