హత్యకేసు నిందితులు అరెస్ట్

10 Feb, 2015 19:04 IST|Sakshi

ప్రొద్దుటూరు(వైఎస్సార్ కడప): వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలం మదూరు గ్రామంలో శుక్రవారం జరిగిన హత్యకేసులో పలువురు అనుమానితుల్ని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు .. చాపాడు మండలం మదూరు గ్రామానికి చెందిన కాపిగాళ్ల సుబ్బారావు(35) అనే వ్యక్తిని బంధువులే కళ్లలో కారం కొట్టి నరికి చంపారు. మృతుని సమీప బంధువు అయిన కాపిగాళ్ల సుబ్బారావు అలియాస్ కుంటి సుబ్బారావుతో పాటు చిన ఓబులేసు, ప్రొద్దుటూరుకు చెందిన ప్రసాద్, కమలాపురానికి చెందిన సూరదాసు అభిషేక్, మరో అనుమానితుడు సుబ్బరాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు