నీలమణిదుర్గ సన్నిధిలో సంగీత దర్శకుడు కోటి

9 Apr, 2018 07:18 IST|Sakshi
అమ్మవారిని దర్శించుకుంటున్న కోటి దంపతులు

పాతపట్నం : పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారిని సినీ సంగీత దర్శకుడు కోటి దంపతులు, సినీ నటుడు భానుచందర్‌ ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సిబ్బంది గౌరవ స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అర్చకుడు రాజేష్‌ ఆచార్యులు అష్టోత్తర గోత్రాలతోపాటు, కుంకుమపూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ అక్కందర సన్యాసిరావు, ఈవో డకర రమణయ్య, మోహనరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు