హైదరాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ దానికి కట్టుబడి ఉండాలని మంత్రి డికె అరుణ తన సహచర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన నష్టం ఏమీ లేదన్నారు. అందరం కలిసి అన్నదమ్ముల్లానే ఉండొచ్చని చెప్పారు. ఇక్కడ ఉండేవారికి, వచ్చివెళ్లేవారికి కూడా ఏ ఇబ్బంది ఉండదని హామీ ఇస్తున్నామన్నారు.