ఢిల్లీలో వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావం
హాజరైన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు
విజయవాడ : దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేక హోదా కోసం కదం తొక్కారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం జంతర్మంతర్ వేదికగా నిర్వహించిన దీక్షలో జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ, టీడీపీలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానంపై మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఈ నెల 28న రాష్ట్ర బంద్కు వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు జలీల్ఖాన్, ఉప్పులేటి కల్పన, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మేకా వెంకట ప్రతాప అప్పారావు, ముఖ్య నేతలు డాక్టర్ పి.గౌతంరెడ్డి, వంగవీటి రాధాకృష్ణ, బూరగడ్డ వేదవ్యాస్, సామినేని ఉదయభాను, జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్, దూలం నాగేశ్వరరావు, పలు అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.