‘నాన్న ఆశయాలే నడిపిస్తున్నాయి’

3 Mar, 2017 20:28 IST|Sakshi
‘నాన్న ఆశయాలే నడిపిస్తున్నాయి’
అరసవల్లి: దేశంలో నిత్యపూజలందుకుంటున్న ఏకైక సూర్యదేవాలయంగా  శ్రీకాకుళంలోని  అరసవల్లి ప్రఖ్యాతి గాంచిందని, ఇక్కడ వాతావరణం అద్భుతమని దివంగత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి తనయుడు సునీల్‌ శాస్త్రి అన్నారు. భార్య మీనాతో కలిసి అరసవల్లి సూర్యదేవాలయాన్ని తొలిసారిగా శుక్రవారం దర్శించుకున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ..‘జై జవాన్‌ జై కిసాన్‌’ నినాదంతో దేశానికి స్ఫూర్తినిచ్చిన లాల్‌ బహదూర్‌ శాస్త్రి అనుసరించిన సిద్ధాంతాలే తనను నడిపిస్తున్నాయని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు ధైర్యమైన చర్య అని, దేశాభివృద్ధికి ఇది తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. వారికి సంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు, అర్చకులు గౌరవ స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.
 
 
 
 
మరిన్ని వార్తలు