వెంకన్న సేవలో స్పీకర్, సిమ్రాన్

11 Feb, 2014 12:49 IST|Sakshi
వెంకన్న సేవలో స్పీకర్, సిమ్రాన్

తిరుమల : కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని మంగళవారం తెల్లవారుజామున శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సినీనటి సిమ్రాన్  దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. రెండో కుమారుడి పుట్టు వెంట్రుకలు తీయిచేందుకు సిమ్రాన్ ...భర్త ఇద్దరు పిల్లలతో కలిసి తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.

మరోవైపు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా వెంకన్నను దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద ఆయనకు టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండలంలో నాదెండ్లకు వేద పండితులు ఆశీర్వచనాలు పలికి, స్వామివారి ప్రసాదాలు అందచేశారు.

మరిన్ని వార్తలు