గుంటూరులో మెరిసిన నగ్మా

14 Dec, 2019 12:01 IST|Sakshi
వేడుకల్లో ప్రసంగిస్తున్న సినీ నటి నగ్మా

గుంటూరు ఈస్ట్‌: నగరంలో ఓ ప్రైవేటు చానల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకలకు సినీ నటి నగ్మా హాజరయ్యారు. సినీ నేపథ్య గాయకులు మనో, శ్రీలేఖ, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ ఈ కార్యక్రమంలో తమ గానంతో సందడి చేశారు. జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనందకుమార్, ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకల్లో ఆర్సీఎస్‌ఎం ఫాదర్‌ బాలా, ఏఈఎల్సీ అధ్యక్షుడు పరదేశిబాబు, ఏఎంజీ అధ్యక్షుడు మహంతి, పాస్టర్లు, ఫెలోషిప్‌ ప్రతినిధులు, విశ్వాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు