నాగోబా సంరంభం

31 Jan, 2014 03:57 IST|Sakshi
నాగోబా సంరంభం

ఆదివాసీల ఆరాధ్యదైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా జాతర గురువారం అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో ప్రారంభమైంది. ఉదయం నుంచే ప్రత్యేక పూజల్లో నిమగ్నమైన మెస్రం వంశీయులు విడిది చేసిన వడమర(మర్రిచెట్టు) నుంచి నాగోబా ఆలయానికి చేరుకుని డోలు, పెప్రె, కాలీకోం, కిక్రి వాయిస్తూ పూజలు చేశారు. పశువుల పేడతో మట్టి పుట్టలను తయారుచేయడానికి ఆడపడుచులు వడమర పవిత్ర బావి నుంచి జలాన్ని తీసుకొస్తున్న చిత్రమిది.    - న్యూస్‌లైన్, ఇంద్రవెల్లి

మరిన్ని వార్తలు