కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

5 Jun, 2015 13:42 IST|Sakshi

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. ఈ రోజు ఉదయం 9.35 గంటలకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని వెల్లడించింది. రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
 

మరిన్ని వార్తలు