శ్రీశైలం చేరుకున్న నందిగామ ఎమ్మెల్యే పాదయాత్ర

1 Mar, 2020 09:52 IST|Sakshi

సాక్షి, కర్నూలు: వికేంద్రీకరణకు మద్ధతుగా కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు చేపట్టిన పాద్రయాత్ర ఆదివారం రోజున కర్నూలు జిల్లా శ్రీశైలంకు చేరుకుంది. ఈ నెల 21న నందిగామ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఈ రోజు ఉదయం శ్రీశైలానికి చేరుకొని శ్రీభ్రమరాంబ, మల్లిఖార్జునస్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం వికేంద్రీకరణకు మద్దతు తెలిపేలా చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహనరావుతో పాటు శ్రీశైలం వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్‌ కృష్ణమోహన్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు