కరోనా నిబంధనలు ఉల్లఘింస్తూ లోకేష్‌ ర్యాలీ

15 Jun, 2020 21:00 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: కోవిడ్‌-19 నిబంధనలు ఉల్లంఘిస్తూ టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్‌ మార్కాపురం నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు. కరోనావైరస్ తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో  కేంద్రం రాజకీయ పార్టీ ల ర్యాలీలకు అనుమతించకపోయినప్పటికీ, నిబంధనలు పాటించకుండానే లోకేష్‌ ర్యాలీకి టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మాస్క్‌ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండానే తిప్పాయపాలెం హైవే నుంచి తాడిపత్రి వరకు టీడీపీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో లోకేష్‌ పాల్గొన్నారు. (చదవండి : కరోనా: ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరీక్షలు)

మరిన్ని వార్తలు