రిలయన్స్, కేంద్రం తోడు దొంగలు: నారాయణ

15 Jul, 2013 15:26 IST|Sakshi
రిలయన్స్, కేంద్రం తోడు దొంగలు: నారాయణ

కాకినాడ: గ్యాస్ విషయంలో రిలయన్స్‌ సంస్థ, కేంద్ర ప్రభుత్వం తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. రిలయన్స్ సంస్థ అక్రమాలపై కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట వామపక్షాలు సోమవారం ఆందోళన చేపట్టారు. నిన్నటి వరకు గ్యాస్‌ ఉత్పత్తి లేదని చెప్పిన రిలయన్స్, కేంద్రం గ్యాస్ ధరలు పెంచడంతో ఒక్కసారిగా మాటమార్చిందని నారాయణ విమర్శించారు. రిలయన్స్ సంస్థ అక్రమాలపై జాతీయ స్థాయిలో  ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

కేజీ బేసిన్లో రిలయన్స్ సంస్థ గ్యాస్ దోపిడిపై తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.  చమురు సంస్థల అక్రమాలపై త్వరలో జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని నారాయణ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అనిశ్చితి ఇంకా అలానే కొనసాగుతుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. యూపీఏ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. పార్టీలోని వారందరిని ఒకేతాటిపైకి తీసుకురాలేని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తుందని నారాయణ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు