నేడు శేషాచలం అడవికి రానున్న రవి ఠాకూర్

17 Apr, 2015 09:34 IST|Sakshi

తిరుపతి: నేడు శేషాచల అడవికి జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రవి ఠాకూర్ రానున్నారు. ఉదయం చెన్నైలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం ఆయన సాయంత్రం శేషాచలం ఎన్కౌంటర్ ఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తారు.

శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన కూలీలు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి శనివారం ఉదయం రవి ఠాకూర్ శేషాచలం ఎన్కౌంటర్ తీరుపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు