జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

25 Jan, 2015 18:49 IST|Sakshi

తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా పెద్దాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తగా ఓటు నమోదు చేయించుకున్నవారిని సీనియర్ సిటిజన్స్ సన్మానించారు. అనంతరం వారికి ఓటరు గుర్తింపుకార్డులు అందజేశారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు, పెద్దాపురం మున్సిపల్‌చైర్మన్ రాజు, తహశీల్దార్లు శ్రీదేవి, సునీల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు