నక్సలిజం పుట్టిందే సీమాంధ్రలో: ఎంపీ మందా

16 Jul, 2013 17:02 IST|Sakshi

కిరణ్ సీఎంలా కాకుండా సీమాంధ్రనేతలా వ్యవహరిస్తున్నారని ఎంపీ మందా జగన్నాథం మండిపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం, ఉగ్రవాదం పెరుగుతుందని సీఎం తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. నక్సలిజం పుట్టిందే సీమాంధ్రలోనని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో సీఎంగా కిరణ్ విఫలమయ్యారని విమర్శించారు. కోర్‌కమిటీకి ఇచ్చిన నివేదికను సీఎం కిరణ్ లీక్ చేసి అనైతికతకు దిగుతున్నారని అన్నారు. సీఎం నివేదికను తెలంగాణ నేతలు ఖండించాలని కోరారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని అన్నారు.

మరిన్ని వార్తలు