మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి కన్నుమూత

9 May, 2014 08:23 IST|Sakshi
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి కన్నుమూత

హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన... ఈరోజు ఉదయం అయిదు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. నేదురుమల్లి భౌతికకాయాన్ని సోమాజిగూడలోని ఆయన స్వగృహానికి తరలించారు.

 నేదురుమల్లి రాజకీయాల్లో పలు కీలక పదవులు చేపట్టారు. ముఖ్యమంత్రిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఆయన పనిచేశారు. వీటితో పాటు పార్టీ సంస్థాగత పదవులను ఆయన చేపట్టారు. నేదురుమల్లి మరణం తీరనిలోటని ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన లోటు పూడ్చలేనిదని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

 

మరిన్ని వార్తలు