నీరు-చెట్టును అడ్డుకున్న హరిజనులు

6 May, 2015 08:52 IST|Sakshi

గుంటూరు: హరిజనులకు కేటాయించిన భూములను తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించిన అధికారులకు చుక్కెదురైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ మండలంలోని పలుదేవర్లపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. నీరు-చెట్టు పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులను ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నారు.

30 సంవత్సారాల కిందట బీఫారమ్‌లు ఇచ్చిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు.
 

మరిన్ని వార్తలు