సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ తరపున నెల్లూరు కార్పొరేషన్కు మేయర్ అభ్యర్థిగా నగరానికి చెందిన షేక్ అబ్దుల్ అజీజ్ను ఎంపిక చేశారు. యువకుడైన అబ్దుల్ అజీజ్ మొదటి నుంచీ వైఎస్సార్సీపీలో ఉన్నారు. జగన్మోహన్రెడ్డి ఓదార్పు కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అబ్దుల్ అజీజ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నెల్లూరు మేయర్ అభ్యర్థిత్వం ముస్లింలకు కేటాయించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జ్ బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, సిటీ సమన్వయకర్త డాక్టర్ పీ. అనీల్కుమార్ యాదవ్, పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బండ్లమూడి అనిత పాల్గొన్నారు.