తిరుమ‌ల‌లో నేపాల్ ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌

26 Aug, 2017 17:48 IST|Sakshi
తిరుమల: నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు ఈఓ అశోక్‌ సింఘాల్‌, జేఈఓ శ్రీనివాసరావు ఘనస్వాగతం పలికారు. ఆయన సతీసమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ​రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లారు. 
మరిన్ని వార్తలు