'దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తాం'

23 Oct, 2014 13:02 IST|Sakshi

శ్రీకాకుళం: హుదూద్ తుపాను విపత్తుతో దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో పక్కా ఇళ్లు నిర్మిస్తామని కుందువాని పేట గ్రామస్తులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హమీ ఇచ్చారు. గురువారం శ్రీకాకుళంలో తుపాను దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుందువానిపేట గ్రామంలో పర్యటించారు.  తుపాన్ ప్రభావిత జిల్లాలోని మత్స్యకార గ్రామాలను స్మార్ట్ విలేజ్లుగా మారుస్తామన్నారు. భూగర్భ కరెంట్, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్ని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు విజయనగరం పర్యటనకు బయల్దేరి వెళ్లారు.  
 

మరిన్ని వార్తలు