డెంగ్యూతో నవ వధువు మృతి

28 Aug, 2015 17:36 IST|Sakshi

వజ్రకరూర్ (అనంతపురం) : డెంగ్యూతో చికిత్స పొందుతూ నవ వధువు మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం చినప్యాపిలి గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చినప్యాపిలి గ్రామానికి చెందిన సుజాత(19)కు పెద ప్యాపిలి గ్రామానికి చెందిన తిప్పయ్యతో మూడు నెలల కిందట వివాహమైంది.

అయితే గత వారం రోజులుగా సుజాత అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు డెంగ్యూ సోకిందని తెలపడంతో.. ఆమెను హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది.

మరిన్ని వార్తలు