అక్టోబర్‌ 3న తదుపరి నిర్ణయం: మంత్రి పితాని

29 Sep, 2013 20:20 IST|Sakshi
అక్టోబర్‌ 3న తదుపరి నిర్ణయం: మంత్రి పితాని

హైదరాబాద్: అక్టోబర్‌ 3న సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే, తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయడం బాధాకరం అన్నారు. ఆ వ్యాఖ్యలు మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన కోరారు.

తన రాజకీయ జీవితంలో ప్రజల నుంచి వచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమం ఇదని మంత్రి  పితాని అన్నారు.

మరిన్ని వార్తలు