రేపు ఎన్జీ రంగా వర్సిటీ స్నాతకోత్సవం

8 Sep, 2015 08:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్/బాపట్ల టౌన్ : రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం జరుపుకోనుంది.  గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ టీవీ సత్యనారాయణ వెల్లడించారు.

బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కళాశాలలోని బీవీ నాథ్ ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జాతీ య వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ హ ర్షకుమార్ భన్వాలా, రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హాజరుకానున్నట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు