సీపీఎస్‌పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి

23 Oct, 2018 12:30 IST|Sakshi
ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌ బాబు

దీనిపై ప్రభుత్వంతో బహిరంగ చర్చకు తాము సిద్దమని సవాల్‌ విసిరారు

గుంటూరు: సీపీఎస్‌ విధానంపై ఏపీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌ బాబు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వేసిన కమిటీపై తమకు నమ్మకం లేదని చెప్పారు.  తమిళనాడులో కమిటీ వేసి రెండున్నరేళ్లు దాటినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఇక్కడ వేసిన కమిటీ పరిస్థితి కూడా అదేనని అన్నారు. సీపీఎస్‌ కొనసాగిస్తే ఆర్ధిక భారం అనేది శుద్ధ అబద్ధమన్నారు.

దీనిపై ప్రభుత్వంతో బహిరంగ చర్చకు తాము సిద్దమని సవాల్‌ విసిరారు. కొన్ని సంఘాలు మా పోరాటంపై విమర్శలు చేస్తున్నాయని, పద్ధతులు మార్చుకోకుంటే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం జేఏసీకి లేదని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు