శ్రీనివాసరావు బెయిల్‌ను రద్దు చేయండి..

14 Jun, 2019 19:24 IST|Sakshi

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఎన్‌ఐఏ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ.. ఏపీ హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పిటిషన్‌ దాఖలు చేసింది. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, కావున అతని బెయిల్‌ను రద్దు చేయాల్సిందిగా ఎన్‌ఐఏ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై హైకోర్టు త్వరలోనే విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో శ్రీనివాసరావు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన మే 25న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. బెయిల్‌ పత్రాలు అందడంతో జైలు అధికారులు శ్రీనివాసరావుని విడుదల చేశారు. 

>
మరిన్ని వార్తలు