గంజాయితో పట్టుబడ్డ నైజీరియన్

15 May, 2016 05:43 IST|Sakshi
గంజాయితో పట్టుబడ్డ నైజీరియన్

విశాఖపట్నం : గంజాయి తరలిస్తూ నైజీరియా దేశానికి చెందిన వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. ద్వారకానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నైజీరియాకు చెందిన ఇకెచుకువా ఆగస్టీన్(23) అరకులో గంజాయి కొనుగోలు చేసి ఆర్టీసీ కాంప్లెక్సులో బస్సు దిగాడు. అక్కడ నుంచి రైల్వే స్టేషన్‌కు నడిచివెళ్తున్నాడు. సీటీఎఫ్ పోలీసులు, ద్వారకా పోలీసులు కలసి  అతడిని పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న రెండు బ్యాగులు తనిఖీ చేయగా 30 కేజీల బరువైన 15 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. సరకుతో పాటు అర్బన్ ఎమ్మార్వో ఎదుట హాజరు పరిచారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు