9 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

20 Jan, 2016 20:40 IST|Sakshi
9 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

పాలకొండ: శ్రీకాకుళం జిల్లా పాలకొండ పేకాట స్థావరంపై బుధవారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు. గోపాలపురం గ్రామంలోని నాగవల్లి నదీ తీరంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 9 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 50 వేల నగదు, 3 ద్విచక్రవాహనాలు, 9 సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేసి స్టేషన్కు తరలించారు.
 

మరిన్ని వార్తలు