నీతి ఆయోగ్ తో రాష్ట్రాలకే లాభం

9 Jan, 2015 19:12 IST|Sakshi

రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగానే దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన బీజేపీ ఏపీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన నీతి ఆయోగ్ ఏర్పాటుతో రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

 

భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు అనేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. బీజేపీ విధానాలు నచ్చిన వారందరిని పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అమిత్‌ షా అధ్యక్షుడయ్యాక బీజేపీని ఎవరూ నిలువరించలేకపోతున్నారని కొనియాడారు.

మరిన్ని వార్తలు