రూ. 260 కోట్లు ఇస్తే నిజాం షుగర్స్ అప్పగిస్తాం!

18 Jan, 2014 04:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తమకు రూ.260 కోట్లు చెల్లిస్తే నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్స్‌ను ఇచ్చేందుకు సిద్ధమని మంత్రివర్గ ఉప సంఘానికి డెల్టా పేపర్స్ కంపెనీ స్పష్టంచేసినట్టు తెలిసింది. నిజాం షుగర్స్ కర్మాగారంపై మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి తదితరులతో ఏర్పా టైన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. కర్మాగారం అప్పగింతపై తమకు నివేదిక ఇవ్వాలని కంపెనీని ఉపసంఘం ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు