పెట్రోల్‌ బంక్‌ కార్మికుడిపై నిజాంపట్నం ఎస్సై దాడి

9 Jun, 2019 21:48 IST|Sakshi

సాక్షి, గుంటూరు : పెట్రోల్‌ బంక్‌ కార్మికుడిపై నిజాంపట్నం ఎస్సై రాంబాబు రౌడీయిజం ప్రదర్శించారు. తన కారుకు డీజిల్‌ అప్పుగా పోయలేదని దాడి చేశాడు. బంక్‌ కార్మికుడు హుమాయూన్‌పై పబ్లిక్‌గా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా పోలీస్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. రౌడీ షీట్ తెరుస్తానని బెదిరింపులకు దిగారు. హుమాయూన్‌పై రాంబాబు దాడికి పాల‍్పడిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. 

మరిన్ని వార్తలు