'వైఎస్ఆర్ సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు'

23 Feb, 2014 14:35 IST|Sakshi
'వైఎస్ఆర్ సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు'

ఒంగోలు : రాష్ట్ర విభజన ప్రక్రియలో కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ముసుగులో క్రియాశీలక పాత్ర పోషించారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఆదివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆఖరి ఘట్టం వరకూ పదవిలో ఉండి ఆ తర్వాత కిరణ్ రాజీనామా చేశారని మండిపడ్డారు. విభజనకు సహకరించిన కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులకు ప్రజల మధ్యకు వచ్చే అర్హత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని బాలినేని తెలిపారు. పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తలకు జగన్ న్యాయం చేస్తారని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు