'మావాళ్లు ఎవరూ డబ్బు తీసుకోలేదు'

17 Aug, 2015 16:48 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో బదిలీల విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, తన పేషీలో సిబ్బంది ఎవరూ డబ్బులు తీసుకోలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. తమ విభాగంపై ఆరోపణలు చేసినవారు దమ్ముంటే వాటిని నిరూపించాలని ఆయన సవాలు చేశారు.

బీసీలకు ఏడాదికి రూ. 380 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని, అందులో రూ. 190 కోట్లను ప్రభుత్వం రాయితీగా ఇస్తుందని కొల్లు రవీంద్ర చెప్పారు. చంద్రన్న బీసీ ఉపాధి వారోత్సవాల పేరుతో ఉపకరణాలు పంపిణీ చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు