ఢిల్లీ: తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న తమ నిర్ణయంలో ఎటువంటి మార్పులేదని బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే సీమాంధ్రలో సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నట్లు చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబుతో రాజకీయాలు కాకుండా, కేవలం ఏపీ పరిస్థితులపై మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. చంద్రబాబు ఎన్డీయేలోకి వచ్చే విషయంపై ఏమీ చర్చించలేదన్నారు.