శ్రీకాకుళం :టీడీపీ హయాంలో కళాకారులకు గుర్తింపు కరువైంది. నేను మృదంగం విభాగంలో ఐదుసార్లు జాతీయ అవార్డు పొందాను. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులు మీదుగా మూడుసార్లు జాతీయ అవార్డు స్వీకరించాను. కళాకారులను ప్రోత్సహించి మావంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆయన మరణానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు. జాతీయ స్థాయి అవార్డులు తీసుకున్న నేను ఉపాధి కోసం అవస్థలు పడుతున్నాను. మమ్మల్ని ఆదుకోవాలి.– బంకుపల్లి దుర్గా శీనివాసశర్మ, శివసంతోషినగర్, ఆమదాలవలస.