ఉద్యోగ భద్రత లేదు...

26 Sep, 2018 06:43 IST|Sakshi

విజయనగరం : సాక్షరభారత్‌లో పనిచేస్తున్న కో ఆర్డినేటర్లు, వీసీలు, ఎంసీలకు కనీస ఉద్యోగ భద్రత లేదు. ఎప్పుడు ఉంచుతారో.. ఎప్పుడు తొలగిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా చులకనగా చూస్తున్నారు. మాకు రెండు వేల రూపాయల వేతనం ఇస్తామన్నారు. కానీ నేటికీ ఇవ్వడం లేదు. నిరక్షరాస్యత నిర్మూలనకు ఎంతగానో శ్రమిస్తున్నాం.. వేతనాల కోసం అడిగితే మాత్రం అదుగో..ఇదుగో.. అంటున్నారే తప్ప పెంచడం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరతాయని భావిస్తున్నాం.           –  పి. శివమ్మ, వీసీ, సాక్షరాభారత్, కొత్తవలస

>
మరిన్ని వార్తలు