చంద్రబాబు ప్రతిజ్ఞకు ముందే వెళ్లిపోయిన అఖిలప్రియ

8 Jun, 2017 19:16 IST|Sakshi
చంద్రబాబు ప్రతిజ్ఞకు ముందే వెళ్లిపోయిన అఖిలప్రియ
కర్నూల/కాకినాడ: నంద్యాలలో మహా సంకల్ప దీక్షకు స్పందన కరువైంది. గురువారం చేయనున్న మహాసంకల్ప దీక్షకు సంబంధించిన ప్రతిజ్ఞ కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా హాల్‌తో సహా కుర్చీలన్నీ ఖాళీగా మిగిలిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిజ్ఞ చేయడానికి ముందే మంత్రి భూమా అఖిలప్రియ వెళ్లిపోయారు.

మరోపక్క, కాకినాడలో చంద్రబాబునాయుడు సంకల్ప దీక్ష చేయించారు. ఈ దీక్షలో భాగంగా 2019నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఏడాదే పురుషోత్తపట్నం ఎత్తిపోతలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 
  
 
మరిన్ని వార్తలు