ఎస్టీలకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలామంది దరఖాస్తు చేసుకున్నాం. నాకు 50 సంవత్సరాలు. నా భర్తకు 55 సంవత్సరాలు. అయినా మాకెవ్వరికీ పింఛన్ రాలేదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే మా లాంటి వారికి న్యాయం జరుగుతుంది.
– దొమ్మూరి గౌరమ్మ,
విశ్వంభరపురం, పార్వతీపురం మండలం