బాబు కేబినెట్లో ఎస్టీ, మైనార్టీలకు మొండిచేయి

8 Jun, 2014 20:00 IST|Sakshi
బాబు కేబినెట్లో ఎస్టీ, మైనార్టీలకు మొండిచేయి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 19 మంది మంత్రులు ప్రమాణం చేశారు.

అయితే చంద్రబాబు కేబినెట్లో ఎస్టీలు, మైనార్టీ వర్గాల నుంచి ఎవరికీ చోటు లభించలేదు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి కూడా కేబినెట్లో బెర్తు దక్కలేదు. ఈ జిల్లా నుంచి టీడీపీ తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచింది. కాగా బాబు కేబినెట్లో కమ్మ, కాపులకు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది.

మరిన్ని వార్తలు