సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణ రాష్ట సమితి అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో కొత్తేమీ లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే టీ.హరీష్రావు శనివారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. రాజ్యాంగబద్దంగా ఎస్సార్సీ ద్వారా వచ్చే సహజ ప్రక్రియనే కేసీఆర్ చెప్పారని ఆయన వివరణ ఇచ్చారు. సీమాంధ్ర ఉద్యమాన్ని కొన్ని అల్లరిమూకలే చేస్తున్నాయని ఆరోపించారు. ఆ ప్రాంతంలో జరిగేది సమైక్య ఉద్యమం కాదని, సీమాంధ్ర ఉద్యమం మాత్రమేనని హరీష్రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలో ఉండే సీమాంధ్రవాసులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ సందర్బంగా హరీష్రావు భరోసా ఇచ్చారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు వారి స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందేనని కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు.