శ్రీవారికి ప్రవాస భారతీయుడు రూ.1.కోటి విరాళం

30 Jun, 2015 21:06 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారికి అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు ఆర్‌కే ఆనంద్ రూ.1 కోటి విరాళం ఇచ్చారు. మంగళవారం ఇక్కడి దాతల విభాగంలో 1 లక్షా 60 వేల యూఎస్ డాలర్లు విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని టీటీడీ నిత్యాన్నప్రసాద ట్రస్టుకోసం వినియోగించాలని దాత కోరారు. అలాగే మరో ఇద్దరు భక్తులు రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు.

మరిన్ని వార్తలు