కిడ్నీ రాకెట్ కేసులో విశాఖ సెవెన్ హిల్స్ ఎండీ అరెస్ట్!

17 Jun, 2014 13:11 IST|Sakshi

విశాఖ : సంచలనం సృష్టించిన ఒడిశా కిడ్నీ రాకెట్‌ కేసులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ బాబును కటక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ బాబు విశాఖలోని సెవెన్స్ హిల్స్ ప్రయివేట్ ఆస్పత్రిలో ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. గత నాలుగు రోజులుగా కటక్ పోలీసులు ప్రబాకర్ బాబును అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే అనారోగ్యంగా ఉందంటూ ఆయన కేజీహెచ్లో చేరారు. మరోవైపు ఈ కిడ్నీ రాకెట్ కేసులో ప్రభాకర్ బాబును పోలీసులు A1గా చేర్చారు. కటక్ పోలీసులు అతడిని ఒడిశాకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు