అధికారుల దాడులు

20 Jan, 2014 04:11 IST|Sakshi

మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ఇసుక మాఫియాపై ఆదివారం అధికారులు దాడులు నిర్వహించారు. మంచిర్యాల మండలం గోదావరి తీరం నుంచి అనుమతి, పర్మిట్లు లేకుండా ఇసుక తరలిస్తున్న 17 లారీలను పట్టుకుని  పోలీసులు జరిమానా విధించారు. ఈ నెల 10వ తేదీన సాక్షిలో ‘తోడేస్తున్నారు’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో ఇసుక మాఫియా రవాణాను కొద్ది రోజులు నిలిపి వేసింది.

మళ్లీ ఆదివారం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీరాంపూర్‌లోని సింగాపూర్ వద్ద గల గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. గతంలో రాత్రుళ్లు మాత్రమే ఇసుకను రవాణా చేసిన అక్రమార్కులు ఆదివారం ఉదయం అనుమతులు లేకుండా, ఓవర్‌లోడ్‌తో అక్రమంగా తరలించారు. సమాచారం అందుకున్న హాజీపూర్ పోలీసులు వాహనాలను తనీఖీ చేయగా, అనుమతి పత్రాలు లేకపోవడంతో జరిమానా విధించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.

మరిన్ని వార్తలు