నెయ్యి దుకాణాలపై దాడులు

12 Jan, 2016 17:25 IST|Sakshi

తెనాలి రూరల్ (గుంటూరు) : గుంటూరు జిల్లా తెనాలి ఉప్పుబజారులోని నెయ్యి దుకాణాలపై అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. నాలుగు నెయ్యి దుకాణాల్లో శాంపిళ్లు తీయగా, రెండు దుకాణాల్లో 15 కిలోల చొప్పున, ఒక దుకాణంలో 10 కిలోల నెయ్యిని సీజ్ చేశారు. శాంపిళ్లను పరీక్షల నిమిత్తం పంపుతామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

>
మరిన్ని వార్తలు