విజయవాడలో పాతభవనం కూలి ముగ్గురి మృతి

5 Dec, 2013 12:15 IST|Sakshi

విజయవాడ: విజయవాడలో పాతభవనం కూలి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.  పాతబస్తీలోని నెహ్రూ బొమ్మ సెంటర్లో పాతభవనంకు మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


ఈ ప్రమాదంలో దుర్మరణం చెందినవారిని భావి నారాయణ, చంద్రశేఖర్, మూర్తిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు